బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలి

ABN , First Publish Date - 2021-02-28T04:16:10+05:30 IST

బీసీలకు చట్టసభల్లో రిజర్వే షన్లు కల్పించాలని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు ఆచారి అన్నారు.

బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

కందనూలు, ఫిబ్రవరి 27: బీసీలకు చట్టసభల్లో రిజర్వే షన్లు కల్పించాలని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు ఆచారి అన్నారు. జిల్లా కేంద్రంలోని సాయిగార్డెన్‌లో శనివారం బీసీటీఏ రాష్ట్ర మహాసభలు ప్రా రంభమయ్యాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జ్యోతిబాఫూలే, అంబేడ్కర్‌ను స్ఫూర్తిగా తీసుకొని జాతి మొ త్తాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయు లు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌ రెడ్డి,  బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణుడు, లక్ష్మణ్‌గౌడ్‌, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భాస్కర్‌, వెంకటయ్య, వెంకటేశ్వర్లు, రాజు, తిరుపతయ్య, పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-28T04:16:10+05:30 IST