అసాంఘిక శక్తులపై అప్రమత్తంగా ఉండండి
ABN , First Publish Date - 2021-10-18T05:25:11+05:30 IST
ఏజెన్సీలో అసాంఘిక శక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని ఏలూర్ రేంజ్ డీఐజీ కేవీ మోహన్రావు అన్నారు.
- డీఐజీ మోహన్రావు
మారేడుమిల్లి, అక్టోబరు 17: ఏజెన్సీలో అసాంఘిక శక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని ఏలూర్ రేంజ్ డీఐజీ కేవీ మోహన్రావు అన్నారు. ఆదివారం తూర్పు ఏజెన్సీ మారేడుమిల్లి పోలీస్స్టేషన్ను ఆయన సందర్శిం చారు. స్టేషన్లోని రికార్డులను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ఫిర్యా దుల స్వీకరణ సమయంలో అనుసరిస్తున్న విధానాలపై ఆరాతీసిన ఆయన ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలన్నారు. గంజాయి అక్రమ రవాణాపై నిఘా వ్యవస్థను పూర్తిస్థాయిలో వినియోగించుకుని రవాణాకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.