ఈ కొత్త వెబ్‌సైట్లు ఓపెన్ చేశారో.. అంతే సంగతులు!

ABN , First Publish Date - 2021-06-17T19:31:20+05:30 IST

లాక్‌డౌన్‌ కాలంలో యువత ఎక్కువగా ఇంటర్నెట్‌..

ఈ కొత్త వెబ్‌సైట్లు ఓపెన్ చేశారో.. అంతే సంగతులు!

  • ఖాతాలు ఖాళీ చేస్తున్న ‘జోకర్‌’
  • ముంబైలో వెలుగుచూస్తున్న సైబర్‌ మోసాలు
  • అప్రమత్తంగా ఉండాలి : సీపీ 


హైదరాబాద్‌ సిటీ : లాక్‌డౌన్‌ కాలంలో యువత ఎక్కువగా ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నారని, చాలా మంది సైబర్‌ క్రిమినల్స్‌ బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. కొత్త వెబ్‌సైట్ల జోలికి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇటీవల ముంబైలో జోకర్‌ పేరిట వెలుగు చూసిన మోసాలను ఆయన గురువారం ప్రస్తావించారు. ప్రస్తుతం ముంబైలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని, నగరంలో కూడా ఇలాంటి మోసాలు వెలుగుచూసే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని యువతకు సూచించారు. చిన్నారులు కూడా కంప్యూటర్‌ను వినియోగిస్తున్న నేపథ్యంలో మాలిషియస్‌, మాల్‌వేర్‌, టూజ్రాన్‌ లాంటి వైర్‌సలను ప్రవేశపెట్టి సైబర్‌ నేరస్థులు సిస్టం డేటాను సేకరించి దుర్వినియోగం చేస్తారని హెచ్చరించారు. ముంబైలో జోకర్‌ పేరుతో వచ్చిన వైరస్‌ ఎంతోమంది ఖాతాలను ఖాళీ చేసిందన్నారు. ఈ విషయం తెలుసుకున్న గూగుల్‌ బ్లాక్‌ చేస్తే, మరో పేరిట సాఫ్ట్‌వేర్‌ రూపొందించి సైబర్‌ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారని ఆయన అన్నారు. గతంలోనూ బ్లూవేల్‌, ఇతర పేర్లతోనూ మోసాలు జరిగాయని గుర్తు చేశారు.

Updated Date - 2021-06-17T19:31:20+05:30 IST