సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-06-15T06:17:15+05:30 IST

పశువులకు సీజనల్‌ వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్‌ వెంకటయ్య పేర్కొన్నారు.

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
పెద్దచింతకుంట పశువైద్యశాలలో రికార్డులను పరిశీలిస్తున్న జిల్లా పశువైద్యాధికారి

జిల్లా పశువైద్యాధికారి డాక్టర్‌ వెంకటయ్య

 నర్సాపూర్‌, జూన్‌ 14: పశువులకు సీజనల్‌ వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్‌ వెంకటయ్య పేర్కొన్నారు. సోమవారం మండలంలోని పెద్దచింతకుంట పశువైద్యశాలను జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య ఆకస్మికంగా సందర్శించి రికార్డులను పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  తొలకరి వర్షాలకు పచ్చి మేత మేసి, వర్షపునీరు తాగిన పశువులు  అనారోగ్యానికి  గురవుతాయన్నారు. ఆ సమయంలో వెంటనే పశువైద్యాధికారిని సంప్రదించాలని సూచించారు.  

  

Updated Date - 2021-06-15T06:17:15+05:30 IST