సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2021-06-15T06:17:15+05:30 IST
పశువులకు సీజనల్ వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ వెంకటయ్య పేర్కొన్నారు.
జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ వెంకటయ్య
నర్సాపూర్, జూన్ 14: పశువులకు సీజనల్ వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ వెంకటయ్య పేర్కొన్నారు. సోమవారం మండలంలోని పెద్దచింతకుంట పశువైద్యశాలను జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య ఆకస్మికంగా సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలకరి వర్షాలకు పచ్చి మేత మేసి, వర్షపునీరు తాగిన పశువులు అనారోగ్యానికి గురవుతాయన్నారు. ఆ సమయంలో వెంటనే పశువైద్యాధికారిని సంప్రదించాలని సూచించారు.