Forestలో దంపతులను చంపి తిన్న ఎలుగుబంటి

ABN , First Publish Date - 2022-06-06T13:00:48+05:30 IST

దట్టమైన అటవీప్రాంతంలో ఓ ఎలుగుబంటి దంపతులను చంపి తిన్న ఉదంతం మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని పన్నా జిల్లాలో తాజాగా వెలుగుచూసింది...

Forestలో దంపతులను చంపి తిన్న ఎలుగుబంటి

భోపాల్(మధ్యప్రదేశ్): దట్టమైన అటవీప్రాంతంలో ఓ ఎలుగుబంటి దంపతులను చంపి తిన్న ఉదంతం మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని పన్నా జిల్లాలో తాజాగా వెలుగుచూసింది. ఓ ఎలుగుబంటి దాడి చేసి దంపతులను చంపి ఐదు గంటలకు పైగా వారి మృతదేహాలను తిన్నట్లు అటవీ శాఖ అధికారి తెలిపారు.ఎలుగుబంటి శరీర భాగాలను తింటుండగా దాన్ని తరిమికొట్టేందుకు అటవీశాఖ సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎట్టకేలకు అటవీ శాఖ సిబ్బంది ఎలుగుబంటిని పట్టుకున్నారు.పన్నా జిల్లా కేంద్రానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖేర్మై ప్రాంతంలో ఉదయం 6.30 గంటలకు ఈ ఘటన జరిగింది. ఇక్కడి రాణిగంజ్ ప్రాంతానికి చెందిన ముకేశ్ ఠాకూర్ (50), ఇందిరా ఠాకూర్ (45) దంపతులు అడవిలోని దేవాలయానికి వెళ్లారు. ఆలయం వద్ద దంపతులు ప్రార్థనలు చేస్తుండగా ఎలుగుబంటి వారిపై దాడి చేసి చంపి వారి శవాలను తినేస్తున్నట్లు గుర్తించామని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డిఎఫ్‌ఓ) గౌరవ్ శర్మ తెలిపారు.


‘‘మేం పన్నా టైగర్ రిజర్వ్ బృందాలకు సమాచారం అందించాం. ఎలుగుబంటిని పట్టుకొని, జంట మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం. ఎలుగుబంటిని ఏదైనా జంతుప్రదర్శనశాలకు పంపాలని ప్లాన్ చేస్తున్నాం’’ అని గౌరవ్ చెప్పారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని అధికారులు  చెప్పారు.సంఘటన జరిగిన రెండు మూడు గంటల తర్వాత పోలీసులు, అటవీ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని దంపతుల బంధువులు పేర్కొన్నారు.


Updated Date - 2022-06-06T13:00:48+05:30 IST