Anantapuram జిల్లా: bear అనుమానాస్పద మృతి
ABN , First Publish Date - 2022-07-08T15:34:40+05:30 IST
ముదిగల్లు సమీపంలో ఎలుగుబంటి (bear) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
అనంతపురం (Anantapuram) జిల్లా: కళ్యాణదుర్గం మున్సిపల్ పరిధిలోని ముదిగల్లు సమీపంలో ఎలుగుబంటి (bear) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇది గమనించిన స్థానికులు అటవీ శాఖ (Forest Department) అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు (officials) మృతి చెందిన ఎలుగుబంటిని పరిశీలించారు. విషపూరిత ఆహారం తినడం వల్లే మృతి చెంది ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. అయినా ఎలుగుబంటి మృతికి గల కారణాలను పూర్తిస్థాయిలో పరిశీలిస్తామని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు.