TS news: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎలుగుబంట్ల కలకలం
ABN , First Publish Date - 2022-07-28T14:50:39+05:30 IST
ఉమ్మడి జిల్లాలో ఎలుగుబంట్ల కలకలం రేగింది. పాలకుర్తి, తొర్రూరు ప్రజలకు ఎలుగుబంట్లు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
వరంగల్: ఉమ్మడి జిల్లాలో ఎలుగుబంట్ల కలకలం రేగింది. పాలకుర్తి, తొర్రూరు ప్రజలకు ఎలుగుబంట్లు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జనావాసాల మధ్య స్వేచ్ఛగా సంచారిస్తుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో సంచరిస్తూ ఎలుగుబంటి స్థానికుల కంటపడింది. పక్కనే ఉన్న గుట్టల్లో నుండి ఎలుగుబంటి ఊళ్లలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. అటవీ అధికారులు స్పందించి ఎలుబంట్లను పట్టుకోవాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు.