బ్యుటీషియన్ కళ్లలో కారం చల్లి..!
ABN , First Publish Date - 2021-02-28T16:34:31+05:30 IST
కళ్లలో కారం చల్లి, గొంతునులుమడంతో
హైదరాబాద్/మియాపూర్ : బ్యుటీషియన్పై ఇద్దరు మహిళలు దాడికి పాల్పడ్డారు. కళ్లలో కారం చల్లి, గొంతునులుమడంతో ఊపిరి ఆడక ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మియాపూర్ పోలీ్సస్టేషన్ పరిధిలో జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్ కొడంగల్కు చెందిన దంపతులు గోవింద్, గీత బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి న్యూహఫీజ్పేట మార్తాండ్నగర్లో నివాసం ఉంటున్నారు. భర్త గోవింద్ సెలూన్షాప్, భార్య గీత బ్యుటీపార్లర్ నడుపుతోంది. శనివారం స్థానికంగా ఉండే శ్రావ్య, సమీర ఫేషియల్ కోసమని వచ్చి చోరీ చేసే ప్రయత్నంలో అడ్డొచ్చిన బ్యుటీషియన్పై దాడి చేశారు. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి పట్టుకుని పోలీసులకు అప్పగించారు.