బీడీ కార్మికులకు జీవనభృతి అందించాలి
ABN , First Publish Date - 2022-09-27T05:58:24+05:30 IST
బీడీ కార్మికులతోపాటు ప్యాకర్లు, బట్టిచటన్, నెలసరి ఉద్యోగులు, టేకేదారులకు రాష్ట్ర ప్రభుత్వం జీవన భృతిని అందించాలని తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిద్దిరాములు, రాష్ట్రప్రధాన కార్యదర్శి ముద్రకోల అంజనేయులు డిమాండ్ చేశారు.
సిరిసిల్ల కలెక్టరేట్, సెప్టెంబరు 25 : బీడీ కార్మికులతోపాటు ప్యాకర్లు, బట్టిచటన్, నెలసరి ఉద్యోగులు, టేకేదారులకు రాష్ట్ర ప్రభుత్వం జీవన భృతిని అందించాలని తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిద్దిరాములు, రాష్ట్రప్రధాన కార్యదర్శి ముద్రకోల అంజనేయులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట సోమవారం బీఎల్ టీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి నాయకులు ధర్నా చేశారు. 2018 ఎన్నికల సమయంలో సీఎం కేసీఅర్ ప్రకటించిన రూ. 2016ను జీవన భృతిని షరుతులు లేకుండా అందించాలని కోరారు. బీడీ పరిశ్రమలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలను ఎత్తివేయాలన్నారు. అంతకుముందు కలెక్టర్ను కలిసేందుకు కార్మికులు వెళ్తుండగా సిరిసిల్ల ఎస్ఐ చీనానాయక్, ట్రాఫిక్ ఎస్ఐ రాజు అడ్డుకున్నారు. అనంతరం కలెక్టరేట్ ఏవో గంగయ్యకు వినతి పత్రాన్ని అందించారు. బీఎల్టీయూ కామారెడ్డి జిల్లా కన్వీనర్ కమ్మరి సదానందం, వడ్ల సాయికృష్ణ, ఎస్.స్వామి, కడవేర్గు శ్రీహరి, నర్సింహులు, గుడ్ల రాజు, ప్రసాద్, బాలకృష్ణ, చింతల రాజు, కృష్ణ, సిద్దిరాములు, ప్రభు, వెంకటేశం, శ్రీనివాస్, రాజీత, మంజుల, బాలలక్ష్మీ, అనిత, స్వప్న, లావణ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు.