సైదాపురం పాలసంఘం చైర్మన్గా బీర్ల ఐలయ్య
ABN , First Publish Date - 2022-06-29T06:34:58+05:30 IST
మండలంలోని సైదాపురం గ్రామంలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికలు మంగళవారం జరిగాయి.
యాదగిరిగుట్ట రూరల్, జూన్ 28: మండలంలోని సైదాపురం గ్రామంలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికలు మంగళవారం జరిగాయి. ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బీర్ల ఐలయ్య వరుసగా 33వ సారి పాల సంఘం చైర్మన్గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్గా చిన్నం నర్సింహులు, డైరెక్టర్గా మల్లు రవి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలఉత్పత్తి దారులకు ఎలాంటి సమస్యలు రాకుండ అన్ని విధాలుగా ఆదుకుంటున్నానని, ప్రభుత్వ పరంగా రాయితీలు నేరుగా అందిస్తున్నానని తెలిపారు. తనపై ఎంతో నమ్మకంతో 33వ సారి చైర్మన్గా ఎన్నుకున్న సభ్యులకు రుణపడి ఉంటానని అన్నారు.