బషీరాబాద్ బస్టాండ్లో యాచకురాలి మృతి
ABN , First Publish Date - 2021-05-11T05:05:08+05:30 IST
బషీరాబాద్ బస్టాండ్లో యాచకురాలి మృతి
బషీరాబాద్: స్థానిక బస్టాండ్లో ఉంటూ బిక్షాటన చేస్తూ జీవిస్తున్న ఓ వృద్ధురాలు నాగమ్మ(68) ఆదివారం రాత్రి మృతిచెందింది. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ పూడూరు ప్రియాంకశ్రావణ్, పోలీసులు బస్టాండ్కు చేరుకుని పరిశీలించారు. అనంతరం సర్పంచ్ భర్త పంచాయతీ కార్మికులను పిలిపించి రాత్రి 12.30గంటలకు ఊరి బయట ఖననం చేయించారు. కాగా మృతురాలికి కుమారుడు, కోడలు ఉన్నారని, ఎవరూ పట్టించుకోక అనాథగా బస్టాండ్ వద్ద కాలం వెళ్లదీస్తోందని స్థానికులు తెలిపారు.