నీరజ్ హత్యకు నిరసనగా బేగంబజార్ బంద్..

ABN , First Publish Date - 2022-05-21T17:15:32+05:30 IST

నీరజ్ హత్యకు నిరసనగా బంద్ పాటిస్తున్నామని బేగంబజార్, షాహీనాథ్ గంజి మార్కెట్ మర్చంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌లు జీవన్, రామ్ లాల్ పేర్కొన్నారు.

నీరజ్ హత్యకు నిరసనగా బేగంబజార్ బంద్..

హైదరాబాద్ : నీరజ్ హత్యకు నిరసనగా బంద్ పాటిస్తున్నామని బేగంబజార్, షాహీనాథ్ గంజి మార్కెట్ మర్చంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌లు జీవన్, రామ్ లాల్ పేర్కొన్నారు. నేడు వీరిద్దరూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. వ్యాపారవేత్తలు అందరూ ఈ హత్యను ఖండిస్తున్నామన్నారు. నీరజ్ హత్యను నిరసిస్తూ బంద్‌లో పాల్గొన్నామని తెలిపారు. ఈ కేసులో ఫస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ఫస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని జీవన్, రామ్ లాల్ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-05-21T17:15:32+05:30 IST