ప్రకృతి సాగుతో మేలు
ABN , First Publish Date - 2021-01-16T05:30:00+05:30 IST
ప్రకృతి వ్యవసాయంతో సమాజానికి, నేలకు మేలు కలుగుతుందని రాష్ట్ర సాధికారక సంస్థ ఎగ్జిక్యూటీవ్ వైస్ చైర్మన్ విజయకుమార్ అన్నారు.
ఏపీ రైతు సాధికారక సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయకుమార్
వేపాడ: ప్రకృతి వ్యవసాయంతో సమాజానికి, నేలకు మేలు కలుగుతుందని రాష్ట్ర సాధికారక సంస్థ ఎగ్జిక్యూటీవ్ వైస్ చైర్మన్ విజయకుమార్ అన్నారు. బొద్దాంలో సుస్థిర వ్యవసాయ కేంద్రాన్ని ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన చిరుధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్ను పరిశీ లించి, ఫుడ్హబ్ అవుట్లెట్ను, బయో ఇన్ఫుట్ సెంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. కార్య క్రమంలో ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ రామాంజనేయులు విజయనగరం, విశాఖ జిల్లాల డీపీఎం ప్రకాష్, ఏవో హేమసుందర్, సీఎస్ఏ స్టేట్ కో-ఆర్డినేటర్ చంద్రశేఖర్, రీజనల్ కో-ఆర్డినేటర్ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.