లబ్ధిదారుల ఇంటికే సంక్షేమ ఫలాలు

ABN , First Publish Date - 2022-05-18T05:47:48+05:30 IST

లబ్దిదారుల ఇంటికే సంక్షేమ ఫలాలు అం దించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కు మార్‌ అన్నారు.

లబ్ధిదారుల ఇంటికే సంక్షేమ ఫలాలు
చెక్కులను అందిస్తున్న ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ 

జగిత్యాల అర్బన్‌, మే 17: లబ్దిదారుల ఇంటికే సంక్షేమ ఫలాలు అం దించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కు మార్‌ అన్నారు. పట్టణంలోని 3,4,5,7,8 18,19 వార్డులకు చెం దిన 9 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మీ పథకం ద్వారా మంజూరైన రూ.9లక్ష లు,  రూ. 3లక్షల విలువగల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను మరో 9మంది ల బ్దిదారులకు చెక్కులను అందజేశారు. అనంతరం ఆయా వార్డుల్లో పర్య టించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ అభివృద్ది సంక్షేమమే ఎజెండాగా తెలంగాణ ప్రభు త్వం ముందుకు సాగుతుందన్నారు. అన్ని వార్డుల్లో అభివృద్దికి పట్టణ ప్రజలు, నాయకులు సహకరించాలని కోరారు. అతి పురాతన పట్టణమై న జగిత్యాలలో ఇంటి అనుమతులకు ఇబ్బందులు ఉండేవన్నారు. టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం అఽధికారంలోకి రావడంతోనే జోనల్‌వ్యవస్థను అమోదిం పజేసి చట్టబద్దంగా ఇంటి నిర్మాణ అనుమతులు దక్కేలా కృషి చేసింద న్నారు. రాష్ట్ర ఏర్పాటుతో టీఎస్‌బీపాస్‌ విధానంతో ఇంటి నిర్మాణ అను మతులను పారదర్శక విధానంతో అందిస్తున్నామన్నారు. ప్రజల భాగ స్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఛైర్మెన్‌ గోలి శ్రీనివాస్‌, పార్టీ ప్రధానకార్యదర్శి అనందరావు, కౌన్సిల ర్‌లు చుక్క నవీన్‌, రేణుక, మల్లవ్వ, తిరుమల్లయ్య, అల్లె గంగసాగర్‌, నాయకులు తదితరులున్నారు.

Updated Date - 2022-05-18T05:47:48+05:30 IST