2.09 లక్షల మంది తల్లులకు లబ్ధి
ABN , First Publish Date - 2022-06-27T05:16:48+05:30 IST
జిల్లాకు అమ్మఒడి పథకం కింద ప్రభుత్వం రూ.314.66 కోట్లు మంజూరు చేసింది. సోమవారం ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి బటన్ నొక్కి ఈ నిధులను తల్లుల బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నారు. జిల్లాలోని 38 మండలాల్లో 1 నుంచి ఇంటర్మీడియేట్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులు 20,9776 మంది ఖాతాలకు ఈనిధులు జమ కానున్నాయి.
రెండు పాఠశాలల్లో
ఒక్కరూ అర్హత సాధించని వైనం
ఒంగోలు (కలెక్టరేట్), జూన్ 26 : జిల్లాకు అమ్మఒడి పథకం కింద ప్రభుత్వం రూ.314.66 కోట్లు మంజూరు చేసింది. సోమవారం ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి బటన్ నొక్కి ఈ నిధులను తల్లుల బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నారు. జిల్లాలోని 38 మండలాల్లో 1 నుంచి ఇంటర్మీడియేట్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులు 20,9776 మంది ఖాతాలకు ఈనిధులు జమ కానున్నాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా అమ్మఒడికి అర్హత సాధించలేదు. ఒంగోలు, చీరాలలోని రెండు పాఠశాలల్లో విద్యార్థులు యాజమాన్యాల తీరు వల్ల నష్టపోయారు. నిబంధనల ప్రకారం 75శాతం హాజరు ఉన్న విద్యార్థులు మాత్రమే అమ్మఒడి లబ్ధిపొందేందుకు అర్హులు. అయితే ఈసారి మాన్యువల్గా కాకుండా మొబైల్ డివైజ్ల ద్వారా యాప్లో హాజరు నమోదు చేయాలని సూచించారు. అయితే ఈ రెండు పాఠశాలల్లో విద్యార్థులకు ఈహాజరు నమోదు కాలేదు. దీంతో వారు అమ్మఒడికి దూరమయ్యారు.
అట్టడుగున సంతనూతలపాడు
అమ్మఒడి లబ్ధిదారుల విషయంలో సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం జిల్లాలో అట్టడుగున నిలిచింది. ఈనియోజకవర్గలో గత ఏడాది 21,584 మంది తల్లులకు రూ.32.38 కోట్లు విడుదల కాగా ఈసారి రూ.1.58 కోట్లు తక్కువగా 20,538 మంది తల్లులకు రూ.30.80 కోట్లు మాత్రమే మంజూరయ్యాయి. ఒంగోలు నియోజకవర్గంలో గత ఏడాదికంటే నాలుగు లక్షలు తక్కువగా విడుదల చేశారు. అమ్మఒడి జిల్లా కార్యక్రమాన్ని సోమవారం స్థానిక కలెక్టరేట్లోని స్పందన సమావేశం హాలులో ఏర్పాటు చేసినట్లు డీఈవో విజయభాస్కర్ తెలిపారు.