‘రైతు సేవా కేంద్రాలతో ప్రయోజనం’
ABN , First Publish Date - 2021-07-26T04:05:13+05:30 IST
రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు మరింత ప్రయోజనం చేకూరనున్నదని ఎమ్మెల్యే మాణిక్రావు, డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ అన్నారు.
న్యాల్కల్, జూలై 25: రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు మరింత ప్రయోజనం చేకూరనున్నదని ఎమ్మెల్యే మాణిక్రావు, డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ అన్నారు. ఆదివారం న్యాల్కల్లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రైతుసేవాకేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అంజమ్మ, వైస్ ఎంపీపీ గౌస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింహారెడ్డి, నాయకులు రవీందర్, రాజుపాటిల్, బస్వరాజ్పాటిల్, బాస్కర్, సంగమేష్ తదితరులు పాల్గొన్నారు.