పేదలందరికీ పథకాలతో లబ్ధి

ABN , First Publish Date - 2022-06-26T05:21:18+05:30 IST

అన్ని వర్గాల పేదలందరికీ పథకాలతో లబ్ధి చేకూర్చామని ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌ అన్నారు.

పేదలందరికీ పథకాలతో లబ్ధి
కరపత్రాన్ని అందజేస్తున్న ఎమ్మెల్యే

ఎమ్మెల్యే మధుసూదన్‌ 

కనిగిరి, జూన్‌ 25 :  అన్ని వర్గాల పేదలందరికీ పథకాలతో లబ్ధి చేకూర్చామని  ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌ అన్నారు. గడపగడపకు కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని ముగ్గుబావివీధి 5వ వార్డులో ఎమ్మెల్యే పర్యటించారు.   పట్టణంలో అత్యధికులు పేదలున్నారన్నారు. వారిలో ముస్లింలు అధికంగా ఉన్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరికీ పథకాలు అందాయన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు రూ.6లక్షల ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించేందుకు రూ.2.5లక్షలు అందజేసా మన్నారు. స్థానికుల సమస్యలను తెలుసుకున్న ఆయన పరిష్కరించాలని సచి వాల య సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో నగరపంచాయతీ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌, నాయకులు రంగనాయకులరెడ్డి, కౌన్సిలర్‌ చొప్పరపు మాధవి, వేల్పుల వెంక టేశ్వర్లుయాదవ్‌, తిరుపతయ్య, పిచ్చిరెడ్డి, డాక్టర్‌ నాయబ్‌రసూల్‌, మురళీయాదవ్‌,  సుబ్బారెడ్డి, మాలకొండారెడ్డి, జిలాని, జానీ, న్యాయవాది సాల్మన్‌రాజు, చింతం శ్రీనివాసులు యాదవ్‌, ఆంజనేయులుయాదవ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-26T05:21:18+05:30 IST