లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలిచింది వీరే

ABN , First Publish Date - 2021-10-03T23:23:21+05:30 IST

బెంగాల్‌లో రెండు లోక్‌సభ స్థానాలైన జాంగిపూర్, శంషేర్‌గంజ్‌లతో పాటు భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మమతా పార్టీనే విజయం సాధించింది. భవానీపూర్ నుంచి స్వయంగా సీఎం మమతా బెనర్జీనే పోటీకి దిగి 71 శాతం ఓట్లు సాధించారు. ఇక జాంగిపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీఎంసీ అభ్యర్థి జాకిర్ హొస్సేన్, శంషేర్‌గంజ్ లోక్‌సభ..

లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలిచింది వీరే

న్యూఢిల్లీ: సెప్టెంబర్ 30న రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. కాగా ఈ ఎన్నికల ఫలితాలను ఆదివారం ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లోని మూడు నియోజకవర్గాల్లో స్థానిక అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకుంది. అలాగే ఒడిశాలోని ఒక స్థానాన్ని స్థానిక అధికార పార్టీ బిజూ జనతా దళ్‌నే గెలుచుకుంది.


బెంగాల్‌లో రెండు లోక్‌సభ స్థానాలైన జాంగిపూర్, శంషేర్‌గంజ్‌లతో పాటు భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మమతా పార్టీనే విజయం సాధించింది. భవానీపూర్ నుంచి స్వయంగా సీఎం మమతా బెనర్జీనే పోటీకి దిగి 71 శాతం ఓట్లు సాధించారు. ఇక జాంగిపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీఎంసీ అభ్యర్థి జాకిర్ హొస్సేన్, శంషేర్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కూడా టీఎంసీ అభ్యర్థే అమిరుల్ ఇస్లామ్ విజయం సాధించారు. ఇక ఒడిశాలో ఏకైక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేడీ అభ్యర్థి రుద్ర ప్రతాప్ మహారథి గెలుపొందారు.


ప్రతి ఎన్నికలో ప్రభావితం చూపే భారతీయ జనతా పార్టీ ఈసారి జరిగిన ఉప ఎన్నికలో ఒక్క సీటు కూడా గెలవకపోవడం గమనార్హం. సీట్లే కాకుండా ఓటు బ్యాంకులో కూడా బీజేపీ చాలా వెనకబడి పోయింది.

Updated Date - 2021-10-03T23:23:21+05:30 IST