బెంగళూరులో మరోసారి పెరిగిన Covid కేసులు

ABN , First Publish Date - 2022-03-20T16:37:54+05:30 IST

బెంగళూరులో కొవిడ్‌ కేసులు మరోసారి పెరిగాయి. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 173 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 138 మంది నమోదయ్యారు. 15 జిల్లాల్లో ఒక్కకే

బెంగళూరులో మరోసారి పెరిగిన Covid కేసులు

బెంగళూరు: బెంగళూరులో కొవిడ్‌ కేసులు మరోసారి పెరిగాయి. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 173 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 138 మంది నమోదయ్యారు. 15 జిల్లాల్లో ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. 14 జిల్లాలకు కలిపి 35 మంది బాధితులయ్యారు. 153 మంది కోలుకోగా బెంగళూరు, బళ్లారిలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. 28 జిల్లాల్లో మృతులు నమోదు కాలేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,031 మంది చికిత్సలు పొందుతున్నారు. 

Updated Date - 2022-03-20T16:37:54+05:30 IST