Tragic: బిల్డింగ్ పైనుంచి పడి బెంగళూరు వైద్యుడు మృతి

ABN , First Publish Date - 2022-06-16T01:43:24+05:30 IST

రెసిడెన్సియల్ అపార్ట్‌మెంట్‌ పైనుంచి కింద పడి బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో..

Tragic: బిల్డింగ్ పైనుంచి పడి బెంగళూరు వైద్యుడు మృతి

బెంగళూరు: రెసిడెన్సియల్ అపార్ట్‌మెంట్‌ పైనుంచి కింద పడి బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ ఒకరు బుధవారం మృతి చెందారు. అమృతల్లి ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది. మృతి చెందిన 32 ఏళ్ల పృధ్వీకాంత్ రెడ్డి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కడప.


మూడు నెలల క్రితమే రెడ్డికి వివాహమైంది. భార్యాభర్తలిద్దరూ గోద్రేజ్ అపార్ట్‌మెంట్‌కు మారారు. కాగా, తామిద్దరూ మంగళవారం రాత్రి కలిసి భోజనం చేశామని, రాత్రి నిద్రపోయి తెల్లవారి చూసే సరికి తన భర్త కనిపించలేదని డాక్టర్ భార్య పోలీసులకు తెలిపారు. పృధ్వీకాంత్ రెడ్డి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కాగా, డాక్టర్ మృతికి ఆరోగ్య సమస్యలు కారణం కావచ్చని, అయితే అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-06-16T01:43:24+05:30 IST