బెంగళూరులోనే అత్యధికంగా కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-10-13T16:34:09+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు మరింత తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 332 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా అత్యధికంగా బెంగళూరులో 145 మందికి వైరస్‌ సోకింది. 11 జిల్లాల్లో పది మందిలో

బెంగళూరులోనే అత్యధికంగా కరోనా కేసులు

బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు మరింత తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 332 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా అత్యధికంగా బెంగళూరులో 145 మందికి వైరస్‌ సోకింది. 11 జిల్లాల్లో పది మందిలోపు బాధితులు నమోదు కాగా 8 జిల్లాల్లో 10-40 మధ్యన బాధితులు నమోదయ్యారు. 515 మంది కోలుకోగా 11 మంది మృతి చెందారు. బెంగళూరులో ఐదుగురు, దక్షిణకన్నడలో ముగ్గురు, మూడు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. 30 జిల్లాల్లో ఇంకా 9,712 మంది చికిత్స పొందుతుండగా అత్యధికంగా బెంగళూరులో 6,595 మంది ఉన్నారు. 

Updated Date - 2021-10-13T16:34:09+05:30 IST