Bengaluru ప్రజాప్రతినిధులతో సీఎం చర్చలు

ABN , First Publish Date - 2022-06-03T17:24:21+05:30 IST

బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై గురువారం ప్రత్యేక

Bengaluru ప్రజాప్రతినిధులతో సీఎం చర్చలు

                           - బీబీఎంపీ ఎన్నికలపైనే దృష్టి


బెంగళూరు, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నళిన్‌కుమార్‌కటీల్‌ అధ్యక్షత వహించారు. బెంగళూరు మల్లేశ్వరంలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో దాదాపు రెండు గంటలకు పైగా ఈ సమావేశం జరిగింది. బీబీఎంపీకి మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తుండటంతో ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత లభించింది. నగర సమస్యలపైనే ప్రధానంగా చర్చించారని సమాచారం. బెంగళూరు సమగ్ర అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై కూడా చర్చించినట్లు తెలిసింది. బెంగళూరు సెంట్రల్‌ లోక్‌సభ సభ్యుడు పీసీ మోహన్‌, నార్త్‌ సభ్యుడు, మాజీ సీఎం డీవీ సదానందగౌడతో పాటు సీనియర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-03T17:24:21+05:30 IST