Metro Rail: 15 వరకు మెట్రో రైల్లో ఎక్కడికి వెళ్లినా చార్జీ రూ.30

ABN , First Publish Date - 2022-08-13T18:38:21+05:30 IST

ఆజాదికా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 15న బిఎంటిసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తుండగా నమ్మ మెట్రో రైలు

Metro Rail: 15 వరకు మెట్రో రైల్లో ఎక్కడికి వెళ్లినా చార్జీ రూ.30

బెంగళూరు, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ఆజాదికా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 15న బిఎంటిసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తుండగా నమ్మ మెట్రో రైలు కార్పోరేషన్‌ కూడా ఈ నెల 13 నుండి 15 వరకు రాయితీలను ప్రకటించింది. లాల్‌బాగ్‌లో పంద్రాగష్టు ఫ్లవర్‌ షో(Flower show)ను తిలకించేందుకు విచ్చేచే ప్రజలు నగరంలో ఎక్కడికైనా సరే రూ 30టికెట్‌తో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నారు. శనివారం నుండి సోమవారం వరకు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 వరకు పేపర్‌ టికెట్లు లాల్‌బాగ్‌ మెట్రో స్టేషన్‌(Lalbagh Metro Station)లో మాత్రమే లభిస్తాయని నమ్మ మెట్రో ప్రకటన పేర్కొంది. ఈ టికెట్లతో ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 వరకు ప్రయాణించవచ్చునని ప్రకటన వెల్లడించింది.

Updated Date - 2022-08-13T18:38:21+05:30 IST