Bengaluru-Patna మధ్య సూపర్‌ఫాస్ట్‌ రైలు సేవలు

ABN , First Publish Date - 2022-06-23T17:58:40+05:30 IST

బెంగళూరు బయప్పనహళ్ళి సమీపంలోని సర్‌ ఎం. విశ్వేశ్వరయ్య టర్మినల్‌ నుంచి మరో సూపర్‌ఫాస్ట్‌ రైలు సేవలు మంగళవారం లాంఛనంగా

Bengaluru-Patna మధ్య సూపర్‌ఫాస్ట్‌ రైలు సేవలు

బెంగళూరు, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): బెంగళూరు బయప్పనహళ్ళి సమీపంలోని సర్‌ ఎం. విశ్వేశ్వరయ్య టర్మినల్‌ నుంచి మరో సూపర్‌ఫాస్ట్‌ రైలు సేవలు మంగళవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు నైరుతి రైల్వేజోన్‌ నగరంలో బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. బెంగళూరు-పాట్నాల మధ్య ఈ సేవలు ఒకవైపు మాత్రమే ఉంటాయని నెంబరు 02354 రైలు విశ్వే శ్వరయ్య టర్మినల్‌లో ప్రతి మంగళవారం మధ్యాహ్నం 1.50కు బయల్దేరి వెళుతుం ది. ఈ రైలు కృష్ణరాజపురం, జోలార్‌ పేట, కాట్పాడి, అరక్కోణం, పెరంబూరు, గూడూరు, విజయవాడ, వరంగల్‌ల మీదుగా పాట్నాకు గురువారం ఉదయం 10.10 గంటలకు చేరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్ళే ప్రయాణీకులు ఈరైలు సేవ లను వినియోగించుకోవాలని ప్రకటనలో కోరారు.


Updated Date - 2022-06-23T17:58:40+05:30 IST