Bengaluru Railway Stationలో హై అలర్ట్
ABN , First Publish Date - 2022-06-18T17:27:33+05:30 IST
కేంద్ర రక్షణశాఖ ప్రకటించిన ‘అగ్నిపథ్’ పథకాన్ని వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల్లో హింసాకాండ చెలరేగిన నేపథ్యంలో నైరుతి రైల్వేజోన్ పరిధిలోని అన్ని
- ‘అగ్నిపథ్’ నిరసనలపై అప్రమత్తం
బెంగళూరు, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): కేంద్ర రక్షణశాఖ ప్రకటించిన ‘అగ్నిపథ్’ పథకాన్ని వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల్లో హింసాకాండ చెలరేగిన నేపథ్యంలో నైరుతి రైల్వేజోన్ పరిధిలోని అన్ని రైల్వేస్టేషన్లలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. బెంగళూరు డివిజన్లోని ప్రధాన రైల్వేస్టేషన్లు కేఎ్సఆర్ సిటీ రైల్వేస్టేషన్, యశ్వంతపుర, కృష్ణరాజపురం, కంటోన్మెంట్లో ముందస్తుగా అదనపు బలగాలను మొహరించారు. ఈ పథకం ప్రకటించినప్పటి నుంచి రాష్ట్రంలో ఎలాంటి అ వాంఛనీయ సంఘటనలు జరగలేదని రైల్వే పోలీసులు వెల్లడించారు. ముందస్తుగా అన్ని రైల్వేస్టేషన్లలోనూ భద్రతను పెంచామన్నారు. అన్ని రైల్వేస్టేషన్లలోనూ ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. డివిజన్లోని మైసూరు, హుబ్బళ్లి రైల్వేస్టేషన్లోనూ రైల్వేపోలీసులను అప్రమత్తం చేశారు.