బెంబేలెత్తించిన బెంగళూరు బౌలర్లు.. ఆపసోపాలు పడి 144 పరుగులు చేసిన రాయల్స్

ABN , First Publish Date - 2022-04-27T03:00:49+05:30 IST

గత మ్యాచ్‌లో ఎదురైన దారుణ పరాభవ భారంతో ఉన్న రాయల్ చాలెంజర్స్

బెంబేలెత్తించిన బెంగళూరు బౌలర్లు.. ఆపసోపాలు పడి 144 పరుగులు చేసిన రాయల్స్

పూణె: గత మ్యాచ్‌లో ఎదురైన దారుణ పరాభవ భారంతో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈసారి చెలరేగింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్లు నిప్పులు చెరిగారు. పదునైన బంతులు విసురుతూ ముప్పుతిప్పలు పెట్టారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ 8 వికెట్లు కోల్పోయి 144 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది.


రియాన్ పరాగ్ ఒక్కడే బౌలర్లను ఎదురొడ్డి అర్ధ సెంచరీతో అజేయంగా నిలవడంతో రాజస్థాన్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. పరాగ్ 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులు చేశాడు. మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేకపోయారు. అశ్విన్ 17, కెప్టెన్ సంజు శాంసన్ 27, డరిల్ మిచెల్ 16 పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్, హేజిల్‌వుట్, వనిందు హసరంగ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. 

Updated Date - 2022-04-27T03:00:49+05:30 IST