నల్లగొండ కలెక్టర్కు బెస్ట్ ఎలక్ర్టోరల్ ప్రాక్టీస్ అవార్డు
ABN , First Publish Date - 2022-01-22T07:39:18+05:30 IST
ఎన్నికల విధుల్లో ఉత్తమ సేవలందించిన అధికారులకు అవార్డులు
పలువురు ఆర్డీవోలకు స్పెషల్ కేటగిరీ అవార్డులు: శశాంక్గోయల్
హైదరాబాద్/నల్లగొండటౌన్, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల విధుల్లో ఉత్తమ సేవలందించిన అధికారులకు అవార్డులు అందజేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్గోయల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్థాయి బెస్ట్ ఎలక్ర్టోరల్ ప్రాక్టీస్ అవార్డుకు నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఎంపికయ్యారని తెలిపారు.
స్పెషల్ కేటగిరీ అవార్డులకు ఆర్డీవోలు రవీందర్రెడ్డి (హుజూరాబాద్), బి.రోహిత్సింగ్(మిర్యాలగూడ), కొమరయ్య (మహబూబాబాద్), ఆదిలాబాద్ నోడల్ ఆఫీసర్ బి. లక్ష్మణ్, తహశీల్దారు ఎం.విజయ్కుమార్ (నల్గొండ జిల్లా), బూత్ లెవల్ అధికారుల్లో బోధన్కు చెందిన అనిత, మహబూబాబాద్కు చెందిన శ్రీవాత్సవ, ఎంపికైనట్లు ఆయన వెల్లడించారు. అదేవిధంగా సీఈఓ కార్యాలయ ఉద్యోగులు ఎ.ప్రసాద్, ఆర్.శ్రీనాథ్, టి.హరీశ్, రవీందర్, జయరాజ్ ఎంపికయ్యారని, వీరికి 25న జాతీయ ఓటరు దినోత్సవంలో అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.