ప్రాణం తీసిన పందెం
ABN , First Publish Date - 2020-10-24T09:37:41+05:30 IST
స్నేహితులు సరదాగా వేసుకున్న పందెం ఒకరి ప్రాణాలు తీసింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగింది. పట్టణంలోని శాంతినగర్
నీళ్లు లేకుండా మద్యం తాగి ఒకరి మృతి
బాన్సువాడ, అక్టోబరు 23: స్నేహితులు సరదాగా వేసుకున్న పందెం ఒకరి ప్రాణాలు తీసింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగింది. పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన సోమేశ్వరం సాయిలు (40) కూలి పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. గురువారం రాత్రి తన స్నేహితులు కుర్మ మల్లుగొండ, గంగారాం, లక్ష్మగొండ, భూమయ్యతో కలిసి గ్రామ శివారులో మందు పార్టీ చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఫుల్ బాటిల్ మద్యంలో చుక్క నీరు కూడా కలుపుకోకుండా తాగాలని స్నేహితులు సాయిలుకు పందెం విసిరారు. దీంతో ఆపకుండా మద్యం తాగిన సాయి లు.. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్నేహితులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.