కొత్త కారు ఈ రోజే కొనుక్కోండి... లేదంటే రేపటి నుంచి...

ABN , First Publish Date - 2021-05-07T19:21:39+05:30 IST

కొత్త కారు కొనుక్కోదలచుకుంటే... ఈ రోజు కొనుక్కోవడమే బెటర్. ఎందుకంటే శనివారం నుంచి కార్ల ధరలు పెరగనున్నాయి.

కొత్త కారు ఈ రోజే కొనుక్కోండి... లేదంటే రేపటి నుంచి...

ముంబై : కొత్త కారు కొనుక్కోదలచుకుంటే... ఈ రోజు కొనుక్కోవడమే బెటర్. ఎందుకంటే శనివారం నుంచి కార్ల ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే... టాటా మోాటార్స్ ధరలు పెంచుతున్నట్లు వెల్లడించింది. ధరల పెంపు నిర్ణయం శనివారం నుంచే అమల్లోకి రానుంది. మరికొన్ని ఇతర కంపెనీలు కూడా ‘ధరల పెంపు’ను ప్రకటించే దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. వివరాలిలా ఉన్నాయి. 


రేపటి నుంచే... 

ధరల పెంపు నిర్ణయం శనివారం నుంచే అమల్లోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది. కాగా ఇప్పటికే కారు  బుక్ చేసుకున్న వారికి మాత్రం ఎలాంటి ఇబ్బందీ లేదు. పాత ధరలే వర్తిస్తాయి. మే 7 లోపు కార్లను బుక్ చేసుకున్న వారికి ధర పెంపు ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. మిగతా వారికి పెరిగిన ధరలే వర్తిస్తాయి.


స్టీల్, ఇతర లోహాల ధరలు పెరగడం వల్ల కార్ల ధరలు పెంచాల్సి వచ్చిందని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్ బిజినెస్) శైలేశ్ చంద్ర తెలిపారు. ఇప్పటికే కార్లను బుక్ చేసుకున్న వారికి ధరల పెంపు ఉండదని పేర్కొన్నారు. ఏ ఏ మోడల్ ధర ఎంత పెరుగుతుందనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. కానీ కార్ల ధరలు సగటున 1.8 శాతం మేర పెరుగుతాయని పేర్కొంది.


Updated Date - 2021-05-07T19:21:39+05:30 IST