గతంలో కంటే మెరుగ్గా ఈ-క్రాప్‌ నమోదు

ABN , First Publish Date - 2021-07-24T05:55:06+05:30 IST

ఈ-క్రాప్‌ నమోదును గతంలో కంటే మెరుగ్గా చేపడుతున్నట్టు కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి అన్నారు.

గతంలో కంటే మెరుగ్గా ఈ-క్రాప్‌ నమోదు
అచ్యుతాపురత్రయంలో ఈ-క్రాప్‌ నమోదును పరిశీలిస్తున్న కలెక్టర్‌

  • కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి

పెదపూడి, జూలై 23: ఈ-క్రాప్‌ నమోదును గతంలో కంటే మెరుగ్గా చేపడుతున్నట్టు కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన జాయింట్‌ కలెక్టర్‌ జి.లక్ష్మీశ, ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డిలతో కలిసి అచ్యుతాపురత్రయంలో ఈ-క్రాప్‌ నమోదును, అచ్యుతాపురత్రయం వద్ద పశ్చిమ ఏలేరు, బిక్కవోలు డ్రెయిన్‌ వద్ద గుర్రపు డెక్క తొలగింపునకు డ్రోన్ల ద్వారా రసాయనాల పిచికారీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీనెలా మొదటి వారంలో గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రంలోను, రెండో వారం మండల స్ధాయిలో వ్యవసాయ సలహా సమావే శాలు ఏర్పాటు చేసి రైతులకు సూచనలు, సలహాలు ఇస్తామన్నారు. అనంతరం వారు ఏపీ త్రయం గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పర్య టనలో శిక్షణా కలెక్టర్‌ గీతాంజలి శర్మ, కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణ, తహశీల్దారు టి.సుభాష్‌, ఎంపీడీవో పి.విజయభాస్కర్‌, ఈవోపీఆర్డీ కె.హరికృష్ణ, సత్యరెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ విజయ్‌కుమార్‌, ఏడీ పద్మశ్రీ, డ్రైనేజీ శాఖ అధికారులు, రామేశ్వరం, ఏపీ త్రయం సర్పంచ్‌లు కొటికలపూడి చినబాబు, అడబాల అను రాధ,  సొసైటీల చైర్మన్లు గుండా ఈశ్వరరావు, మార్ని కామరాజు చౌదరి, వైసీపీ రాష్ట్ర కన్వీనర్‌ అద్దంకి ముక్తేశ్వరరావు, అన్నవరం దేవస్థానం పాలకమండలి సభ్యులు మోకా సూరిబాబు,  రైతు విభాగం మండల కన్వీనర్‌ కోరా వీర్రాజు చౌదరి, మాజీ ఎంపీపీ కర్రి శ్రీవెంకటరెడ్డి, వైసీపీ నాయకులు ఉండ్రు సత్యనారా యణ, పేపకాయల వెంకటరమణ, పెండెం శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-24T05:55:06+05:30 IST