ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్యం

ABN , First Publish Date - 2022-10-08T04:58:46+05:30 IST

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్యం అందుబాటులో

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్యం
వైద్యపరీక్షలు చేస్తున్న డాక్టర్‌ అమృత జోసెఫ్‌

చౌదరిగూడ, అక్టోబరు 7: ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్యం అందుబాటులో ఉందని డాక్టర్‌ అమృత జోసెఫ్‌ అన్నారు. జిల్లేడ్‌ చౌదరిగూడ మండల కేంద్రంలోని ఆర్యసమాజ్‌ ఆవరణలో శుక్రవారం కొందుర్గు పీహెచ్‌సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సర్పంచ్‌ గూడ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ అమృత జోసెఫ్‌ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేయించుకోవాలన్నారు. అదేవిధంగా ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ శిబిరంలో 136మందికి వైద్యపరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తగదని సూచించారు. అనారోగ్యంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మహేష్‌ బాబు, ఎంపీహెచ్‌ఈవో ప్రభులింగం, రాఘవులు, అశ్వాక్‌ అహ్మద్‌, లూథి పాల్గొన్నారు.



Updated Date - 2022-10-08T04:58:46+05:30 IST