సరికొత్త అధ్యయనాలతో మెరుగైన చికిత్స

ABN , First Publish Date - 2022-08-14T05:43:43+05:30 IST

సరికొత్త అధ్యయనాలతో రోగుల కు మెరుగైన చికిత్స అందించవచ్చని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికా స్‌ భాటియా అన్నారు. బీబీనగర్‌లోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)లో పాథాలజీ, మెడిసిన్‌ విభాగం ఆధ్వర్యంలో క్లాసిఫికేషన్‌ ఆఫ్‌ న్యారీ సిస్టమ్‌(సీఎన్‌ఎ్‌స) ట్యూమర్స్‌ రీసెంట్‌ అప్‌డేట్స్‌ అనే అంశంపై శనివారం నిర్వహించిన వర్క్‌షాపును భాటియా ప్రారంభించి మాట్లాడారు.

సరికొత్త అధ్యయనాలతో మెరుగైన చికిత్స
సమావేశంలో మాట్లాడుతున్న ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికాస్‌ భాటియా

ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికాస్‌ భాటియా

బీబీనగర్‌, ఆగస్టు 13: సరికొత్త అధ్యయనాలతో రోగుల కు మెరుగైన చికిత్స అందించవచ్చని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికా స్‌ భాటియా అన్నారు. బీబీనగర్‌లోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)లో పాథాలజీ, మెడిసిన్‌ విభాగం ఆధ్వర్యంలో క్లాసిఫికేషన్‌ ఆఫ్‌ న్యారీ సిస్టమ్‌(సీఎన్‌ఎ్‌స) ట్యూమర్స్‌ రీసెంట్‌ అప్‌డేట్స్‌ అనే అంశంపై శనివారం నిర్వహించిన వర్క్‌షాపును భాటియా ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వివిధ కణుతుల పరిణామాలను వర్గీకరించిందని, వీటిని అధ్యయనం చేయాలన్నారు. దీంతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి ప్రాణాలను కాపాడవచ్చన్నా రు. కార్యక్రమంలో ఎయిమ్స్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ నిరజ్‌ అగర్వాల్‌, మైక్రోబయాల జీ ప్రొఫెసర్‌, ఎయిమ్స్‌ పీఆర్‌వో శ్యామల, పాథాలజిస్టులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-14T05:43:43+05:30 IST