కరోనాపై అప్రమత్తంగా ఉండండి

ABN , First Publish Date - 2021-04-22T10:15:42+05:30 IST

కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి వాహనంలో వీధుల్లో తిరుగుతూ మైక్‌ ద్వారా ప్రచారం చేశారు.

కరోనాపై అప్రమత్తంగా ఉండండి

  • మైక్‌ ద్వారా ప్రచారం  చేస్తున్న డిప్యూటీ స్పీకర్‌

బాపట్ల, ఏప్రిల్‌ 21: కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి వాహనంలో వీధుల్లో తిరుగుతూ మైక్‌ ద్వారా ప్రచారం చేశారు. వైరస్‌ ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచించారు. బుధవారం గుంటూరు జిల్లా బాపట్లలో ఆయన ప్రత్యేక వాహనానికి మైక్‌లు ఏర్పాటు చేసి వీధుల్లో ప్రచారం చేపట్టారు. పాతబస్టాండ్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.   

Updated Date - 2021-04-22T10:15:42+05:30 IST