TS News: భద్రాచలం వద్ద నిలకడగా గోదావరి ప్రవాహం

ABN , First Publish Date - 2022-08-11T12:36:15+05:30 IST

భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. గోదావరి ప్రస్తుత నీటిమట్టం 51.50 అడుగులు ఉంది.

TS News: భద్రాచలం వద్ద నిలకడగా గోదావరి ప్రవాహం

భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. గోదావరి ప్రస్తుత నీటిమట్టం 51.50 అడుగులు ఉంది. గోదావరికి 13,43,344 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బుధవారం ఉదయం 5 గంటలకు భద్రాచలం వద్ద 45.3 అడుగుల నీటి మట్టం నమోదైంది. సాయంత్రం 4 గంటలకు 50.5 అడుగులకు చేరుకున్నది. తెలంగాణ (Telangana) అధికారులు మాత్రం 55 అడుగుల వరకు గోదావరి నీటి మట్టం చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వరద కారణంగా ఇప్పటికే ఏలూరు జిల్లా (Eluru District) కుక్కునూరు-దాచారం మధ్య రాకపోకలు నిలిచిపోగా సీతారామనగరం, ముత్యాలమ్మపాడు వెళ్లే రహదారులు కూడా నీట మునిగాయి.

Updated Date - 2022-08-11T12:36:15+05:30 IST