Bhadrachalam: రామయ్య సన్నిధిలో పాడైపోయిన 4వేల లడ్డూల ప్రసాదం

ABN , First Publish Date - 2022-07-20T17:49:10+05:30 IST

భద్రాద్రి రామయ్య(Ramaiah temple) సన్నిధిలో సుమారు 4వేల లడ్డూల ప్రసాదం పాడైపోయాయి.

Bhadrachalam: రామయ్య సన్నిధిలో పాడైపోయిన 4వేల లడ్డూల ప్రసాదం

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి రామయ్య(Ramaiah temple) సన్నిధిలో సుమారు 4వేల లడ్డూల ప్రసాదం పాడైపోయాయి. భక్తులు వస్తారని లడ్డు ప్రసాదాన్ని ఆలయ సిబ్బంది తయారు చేశారు. అయితే గోదావరి వరదల వల్ల భక్తుల సంఖ్య తగ్గడంతో లడ్డూలు పాడైపోయాయి. వారం క్రితం తయారు చేసిన లడ్డూలు భక్తుల లేక నిలువ ఉండి పాడైన వైనం నెలకొంది. 1 లక్ష రూపాయలకు పైగా  విలువ గల  లడ్డూలు పాడైనట్లు ఆలయ అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-07-20T17:49:10+05:30 IST