TS News: రామయ్య సన్నిధిలో ఘనంగా శరన్నవరాత్రి మహోత్సవాలు

ABN , First Publish Date - 2022-10-02T15:01:27+05:30 IST

భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

TS News: రామయ్య సన్నిధిలో ఘనంగా శరన్నవరాత్రి మహోత్సవాలు

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఏడవ రోజైన నేడు ఐశ్వర్య లక్ష్మి అలంకారంలో లక్ష్మీ తాయారు అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉత్సవాల సందర్భంగా ఉదయం 8 గంటలకు (మూలమూర్తికి) అమ్మవారికి పంచామృతాలతో విశేష స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఉదయం 10 గంటలకు భక్తులకు అమ్మవారి అలంకార దర్శనం కల్పించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మహా నివేదన జరుగనుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సామూహిక కుంకుమ అర్చనలు,  లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణం నిర్వహించనుండగా... సాయంత్రం తిరువీధి సేవ చేయనున్నారు. రేపు వీర  లక్ష్మీ అలంకారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. 

Updated Date - 2022-10-02T15:01:27+05:30 IST