సీఎం కేసీఆర్‌ను కలిసిన భగత కుటుంబం

ABN , First Publish Date - 2021-05-11T06:40:39+05:30 IST

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో గెలుపొందిన ఎమ్మెల్యే నోముల భగత్‌ కుటుంబసభ్యులతో కలిసి సోమవారం ప్రగతిభవనలో సీఎం కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.

సీఎం కేసీఆర్‌ను కలిసిన  భగత కుటుంబం
ప్రగతిభవనలో సీఎం కేసీఆర్‌ను కలిసిన భగత కుటుంబసభ్యులు, మంత్రులు హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి, బి.వినోద్‌కుమార్‌, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు

హాలియా, మే 10 : నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో గెలుపొందిన ఎమ్మెల్యే నోముల భగత్‌ కుటుంబసభ్యులతో కలిసి సోమవారం ప్రగతిభవనలో సీఎం కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని సీఎం కేసీఆర్‌ భగత్‌కు సూచించారు. వారి వెంట మంత్రులు జగదీ్‌షరెడ్డి, హరీ్‌షరావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, సోమా భరత్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - 2021-05-11T06:40:39+05:30 IST