భావితరాలకు మార్గదర్శి భగవద్గీత
ABN , First Publish Date - 2021-01-24T07:09:49+05:30 IST
భగవద్గీత వంటి మహాగ్రంథాలను సంస్థ ద్వారా అవిష్కరించడం అభినందనీయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
పెద్ద దోర్నాల, జనవరి 23 : భగవద్గీత వంటి మహాగ్రంథాలను సంస్థ ద్వారా అవిష్కరించడం అభినందనీయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. మంగళగిరిలో విద్యాశాఖ మంత్రి సురేష్ కార్యాలయంలో సేఫ్షాప్ సంస్థ ఆంగ్లం, సంస్కృతం హిందీ మాధ్యమాలలో భగవద్గీత పుస్తకాలను రూపొందించి మంత్రి సురేష్ ద్వారా శనివారం అవిష్కరించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ... సేఫ్షాప్ సంస్థ ఆన్లైన్ ద్వారా పుస్తకాలను మార్కెట్లోకి విడుదల చేయడం మంచి పరిణామమన్నారు. కార్యక్రమంలో కాకర్ల రవి, తంగిరాల జాన్సన్, కంది కొండారెడ్డి, వి.శ్రీనివాసరావు, బెల్లం కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.