ప్రజల దాహార్తి తీర్చేందుకే మిషన్‌ భగీరథ

ABN , First Publish Date - 2020-09-22T05:53:06+05:30 IST

ప్రజల దా హార్తి తీర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకం ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు

ప్రజల దాహార్తి తీర్చేందుకే మిషన్‌ భగీరథ

మంచిర్యాల, సెప్టెంబరు 21: ప్రజల దా హార్తి తీర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకం ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. సోమవా రం జిల్లా కేంద్రంలోని 16వ వార్డులో మిష న్‌ భగీరథ పైపులైన్‌ పనులను ప్రారం భించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్‌ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చే స్తోందన్నారు. పట్టణ ప్రజలకు త్వరలో ఇంటింటికి తాగునీరు అందిస్తామని తెలి పారు. వార్డు కౌన్సిలర్‌ బోరిగం శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ము న్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, వైస్‌ చైర్మన్‌ గాజుల ముకేష్‌గౌడ్‌, మాజీ చైర్మన్‌ మామిడిశెట్టి వసుంధర, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు గాదె సత్యం పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-22T05:53:06+05:30 IST