రాజన్న క్షేత్రంలో భక్తజన సందోహం

ABN , First Publish Date - 2022-08-09T05:47:48+05:30 IST

వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం సోమవారం భక్తజనంతో కిటకిటలాడింది.

రాజన్న క్షేత్రంలో భక్తజన సందోహం
స్వామివారి దర్శనానికి క్యూలైన్‌లో వేచిఉన్న భక్తులు

- స్వామిదర్శనం కోసం బారులు

వేములవాడ, ఆగస్టు 8: వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం సోమవారం భక్తజనంతో కిటకిటలాడింది. శ్రావణమాసం రెండో సోమవారం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి సుమారు 20 వేలకు పైగా భక్తులు వేములవాడకు తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తులు తొలుత ఆలయ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించిన అనంతరం ధర్మదర్శనం, శీఘ్రదర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి చేరుకుని తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకుని తరించారు. సోమవారం సందర్భంగా లఘు దర్శనం అమలు చేస్తుండడంతో భక్తులు నందీశ్వరుడి విగ్రహం వ్దద నుంచి స్వామివారిని దర్శించుకున్నారు.  కోడెమొక్కు చెల్లించుకోవడంతో పాటు స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం తదితర ఆర్జిత సేవలలో భక్తులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో స్వామివారి దర్శనం కోసం రెండు గంటలకు పైగా సమయం పట్టగా, కోడెమొక్కు చెల్లింపు కోసం మూడు గంటల సమయం పట్టింది. రోజంతా పలుమార్లు వర్షం కురవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. 


Updated Date - 2022-08-09T05:47:48+05:30 IST