APలో అప్పులు తప్ప అభివృద్ధి లేదు: Bhanu Prakash Reddy

ABN , First Publish Date - 2022-07-17T20:34:37+05:30 IST

జగన్ పభుత్వంపై బీజేపీ నేత భాను ప్రకాష్రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

APలో అప్పులు తప్ప అభివృద్ధి లేదు: Bhanu Prakash Reddy

న్యూఢిల్లీ (Delhi): జగన్మోహన్ రెడ్డి (Jaganmohan reddy) ప్రభుత్వంపై ఏపీ (AP) బీజేపీ (BJP) అధికార ప్రతినిధి భాను ప్రకాష్రెడ్డి (Bhanu Prakash Reddy) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో అప్పులు తప్ప అభివృద్ధి లేదని విమర్శించారు. ఖజానా నింపేందుకు హిందూ ఆలయాలపై దృష్టి సారించారని, వెంకటేశ్వరస్వామి (Venkateswara Swamy) రూ.500 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ల (Fixed Deposits)ను మళ్లించుకోవాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. ముస్లిం (Muslim), క్రిస్టియన్ (Christian) బోర్డుల నిధులు తీసుకునే పని చేయగలదా? అని ప్రశ్నించారు. దేవాలయాల నిధులను ఖజానాకు మళ్లించే పని విరమించుకోవాలని భాను ప్రకాష్రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2022-07-17T20:34:37+05:30 IST