ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి
ABN , First Publish Date - 2022-05-29T06:21:28+05:30 IST
విశ్వవిఖ్యాత నటసార్వభౌమునిగా తెలుగువారి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన దివంగత సీఎం ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి దాడి వీరభద్రరావు
అనకాపల్లి టౌన్, మే 28: విశ్వవిఖ్యాత నటసార్వభౌమునిగా తెలుగువారి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన దివంగత సీఎం ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు డిమాండ్ చేశారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ తెలుగు వ్యక్తి కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఏనాడో భారతరత్న అవార్డును ఇచ్చి ఉండేదన్నారు. ప్రధాని మోదీ ఎన్టీఆర్ను భారతరత్నతో సత్కరించి దక్షిణ భారతీయుల మనోభావాలను గౌరవిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ స్థలాన్ని ఎన్టీఆర్ జ్ఞాపికశాలగా తెలంగాణ సీఎం కేసీఆర్ రూపొందించాలని కోరారు. ఎన్టీఆర్ నటించిన చారిత్రత్మాకమైన విభిన్న పాత్రలను పంచలోహాలతో విగ్రహాలుగా మలిచి, మ్యూజియంగా చేయాలన్నారు.