Bharath Bandh: బెజవాడ పోలీసుల అప్రమత్తం
ABN , First Publish Date - 2022-06-20T13:29:21+05:30 IST
భారత్ బంద్ నేపథ్యంలో బెజవాడ పోలీసులు అప్రమత్తమయ్యారు. కేంద్ర ప్రభుత్వాల కార్యాలయాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
విజయవాడ: అగ్నిపథ్కు వ్యతిరేకంగా తలపెట్టిన భారత్ బంద్(Bharath bandh) నేపథ్యంలో బెజవాడ పోలీసులు అప్రమత్తమయ్యారు. కేంద్ర ప్రభుత్వాల కార్యాలయాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈరోజు ఉదయం 5 గంటల నుంచే నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో పోలీసు అదనపు బలగాలు మోహరించారు. రైల్వేస్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో పోలీసులు చేరుకున్నారు. భారత్ బంద్ పేరిట హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చిరికలు జారీ చేశారు.