ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్: యూపీలో బీజేపీకి 320+
ABN , First Publish Date - 2022-03-08T04:51:40+05:30 IST
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్లో వెల్లడైంది...
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్లో వెల్లడైంది. 403 అసెంబ్లీ నియోజకవర్గాలున్న యూపీలో బీజేపీకి 288 నుంచి 326 స్థానాలు దక్కుతాయని వెల్లడించింది. సమాజ్వాదీ పార్టీకి 71 నుంచి 101 స్థానాలు దక్కనున్నాయి. బీఎస్పీకి 3 నుంచి 9 స్థానాల్లో విజయం దక్కే అవకాశాలున్నాయి. ఇవి ఎగ్జిట్ పోల్స్ మాత్రమే. అసలు ఫలితాలు ఈ నెల 10న వెల్లడౌతాయి.