ప్రభుత్వం ప్రజల ప్రాణాలు గాలికి వదిలేసింది: భట్టి విక్రమార్క

ABN , First Publish Date - 2021-05-11T18:43:22+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం ప్రజల ప్రాణాలు గాలికి వదిలేసిందని భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విమర్శించారు.

ప్రభుత్వం ప్రజల ప్రాణాలు గాలికి వదిలేసింది: భట్టి విక్రమార్క

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రజల ప్రాణాలు గాలికి వదిలేసిందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాజకీయ క్రీడలు పక్కన పెట్టి ముందు ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరారు. తెలంగాణలో కనీసం 15 రోజులైనా లాక్‌డౌన్ పెట్టాలని సూచించారు. కరోనా ట్రీట్‌మెంట్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఐసోలేషన్ సెంటర్‌ పెట్టాలన్నారు. హోటల్స్ స్వాధీనం చేసుకుని క్వారంటైన్‌ సెంటర్లుగా మార్చాలని, ప్రతి పీహెచ్‌సీలో 30 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయాలని భట్టి విక్రమార్క ప్రభుత్వానికి సూచించారు.

Updated Date - 2021-05-11T18:43:22+05:30 IST