పార్టీ అంతర్గత విషయాలపై కేసీ వేణుగోపాల్‌తో చర్చించాం: Bhatti

ABN , First Publish Date - 2022-07-05T19:54:39+05:30 IST

తమ పార్టీ అంతర్గత విషయాలపై కేసీ వేణుగోపాల్(KC Venugopal)తో చర్చించామని సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) వెల్లడించారు.

పార్టీ అంతర్గత విషయాలపై కేసీ వేణుగోపాల్‌తో చర్చించాం: Bhatti

New Delhi : తమ పార్టీ అంతర్గత విషయాలపై కేసీ వేణుగోపాల్(KC Venugopal)తో చర్చించామని సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) వెల్లడించారు. నేడు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి(MLA Jaggareddy) చేసిన వ్యాఖ్యలపై పార్టీలో చర్చించామని అంతా సర్దుమణిగిందన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో భారీ చేరికలు ఉంటాయన్నారు. బీజేపీ(BJP) జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా టీఆర్ఎస్ పార్టీ(TRS Party)తో ఆ పార్టీ దోస్తీ బయటపడిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) విభజన చట్టంలోని హామీలను నెరవేరుస్తారని ఆశించామన్నారు. టీఆర్ఎస్, బీజేపీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోలేదన్నారు.



Updated Date - 2022-07-05T19:54:39+05:30 IST