సీఎం కేసీఆర్ మాటలు దేశంపై దాడిగా చూడాలి: భట్టి విక్రమార్క

ABN , First Publish Date - 2022-02-03T20:57:45+05:30 IST

రాజ్యాంగాన్ని మార్చాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు దేశంపై దాడిగా చూడాలని...

సీఎం కేసీఆర్ మాటలు దేశంపై దాడిగా చూడాలి: భట్టి విక్రమార్క

హైదరాబాద్: రాజ్యాంగాన్ని మార్చాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు దేశంపై దాడిగా చూడాలని సీఎల్సీ నేత భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించే చట్టబద్ధతను రాజ్యాంగం‌ కల్పించిందన్నారు. దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ సమానమే అని రాజ్యాంగం చెప్పిందని, ఇప్పుడు సీఎం ప్రకటనతో కేసీఆర్ మేకవన్నె పులి అని తెలిపోయిందన్నారు. అందరం ఏకమై రాజ్యాంగాన్ని కాపాడుకుందామని పిలుపిచ్చారు.


సీఎం కేసీఆర్‌ టక్కు టమార, గోకర్ణ మాయలతో దేశాన్ని మోసం చేస్తున్నారని, రాజ్యాంగంపై అవగాహన లేని కేసీఆర్ సీఎంగా ఉండడం దురదృష్టకరని భట్టి విక్రమార్క అన్నారు. కేసీఆర్ గ్రామ స్థాయి ఫ్యూడల్ నాయకుడిగా మాట్లాడారని విమర్శించారు. ఎమ్మార్పిఎస్ అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ ప్రకటనలను తాను ఏకీభవిస్తానన్నారు. దేశం, రాష్ట్రం రెండుగా విభజించే రోజులు దగ్గర పడ్డాయని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-02-03T20:57:45+05:30 IST