టీచర్ల బదిలీలపై ప్రభుత్వం ఇష్టానుసారం చేస్తోంది: భట్టి విక్రమార్క

ABN , First Publish Date - 2021-12-16T23:41:11+05:30 IST

టీచర్ల బదిలీలపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టానుసారం చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.

టీచర్ల బదిలీలపై ప్రభుత్వం ఇష్టానుసారం చేస్తోంది: భట్టి విక్రమార్క

హైదరాబాద్: టీచర్ల బదిలీలపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టానుసారం చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీచర్ల బదిలీలు హేతుబద్దంగా లేదన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు.టీచర్ల సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.కరోనాతో ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పారు.ప్రభుత్వ జీవో 317పై స్పష్టత లేదన్నారు. కొంత మంది టీచర్ల పిల్లలు జివనైల్ డయాబెటిస్‌తో బాధపడే వారున్నారని చెప్పారు.వారికి రెగ్యులర్‌గా ట్రీట్ మెంట్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.తల్లిదండ్రులు ఒక చోట పిల్లలు ఒక చోట ఉండలేని స్థితి ఉంటుందని భట్టి విక్రమార్క అన్నారు. 


అలాంటి వారికి ఈ బదిలీలతో చాలా ఇబ్బందులు ఉన్నాయన్నారు.విద్యాశాఖ మంత్రి .. చీఫ్ సెక్రటరీ టీచర్ల బదిలీలపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు.సమగ్రంగా స్టడీ చేయకుండా .. అదరా బాదరాగా బదిలీలపై నిర్ణయం సరికాదన్నారు.టీచర్ల బదిలీలపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తున్నానని వివరించారు. టీచర్ల బదిలీలపై ప్రభుత్వం సరైన నిర్ణయంతో బదిలీలు చేయకపోతే పిల్లలపై ప్రభావం పడుతుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-16T23:41:11+05:30 IST