ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదు: భట్టివిక్రమార్క

ABN , First Publish Date - 2022-07-16T03:30:33+05:30 IST

గోదావరి వరద సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీఎల్పీ నేత

ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదు: భట్టివిక్రమార్క

భద్రాచలం: గోదావరి వరద సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. గోదావరి వరద సహాయక చర్యలను పరిశీలించేందుకు శుక్రవారం ఆయన భద్రాచలం వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే పొదెం వీరయ్యతో కలిసి వరద పునరావాస కేంద్రాలను పరిశీలించారు. అంతకుముందు ఆయన్ను సారపాక వద్ద పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిడ్జిపై ప్రతిపక్ష నేత వాహనాలను అనుమతించరా, వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం బయటపడుతుందనే అడ్డుకుంటున్నారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆ తరువాత భట్టి వాహనాన్ని పోలీసులు అనుమతించగా.. ఆయన కరకట్టపైకి చేరుకుని గోదావరి వరద ఉధృతిని పరిశీలించారు. 

Updated Date - 2022-07-16T03:30:33+05:30 IST