Konaseema జిల్లా: పంచాయతీ కార్యదర్శి Bhavani Suicide కేసు..
ABN , First Publish Date - 2022-07-08T15:02:30+05:30 IST
పంచాయతీ కార్యదర్శి భవానీ ఆత్మహత్య కేసులో పోస్టుమార్టం (Postmortem) ఇంకా పూర్తి కాలేదు.
అమలాపురం (Amalapuram): కోనసీమ జిల్లా, పంచాయతీ కార్యదర్శి భవానీ (Bhavani) ఆత్మహత్య (Suicide) కేసులో పోస్టుమార్టం (Postmortem) ఇంకా పూర్తి కాలేదు. వైసీపీ (YCP) నేతల వేధింపులతోనే భవనీ ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు ఆరోపించారు. వేధింపులకు గురిచేసిన వైసీపీ నేతలను అరెస్ట్ (Arrest) చేసే వరకు మృతదేహానికి పోస్టుమార్టం చేయొద్దని వారు ఆందోళనకు చేపట్టారు. దీంతో వైసీపీ నేతలు అధికార పలుకుబడితో కేసు లేకుండా రాజీకి ప్రయత్నిస్తున్నారు.
వైసీపీ నేతల వేధింపులతో పంచాయతీ కార్యదర్శి భవానీ ఆత్మహత్య చేసుకుంది. ఉప్పలగుప్తం మండలం, చెర్లపల్లి ఎస్టీ మహిళ అయిన రొడ్డా భవానీ(32) గురువారం అమలాపురం మండలం కామనగరువులోని తన సొంత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు భర్త వెంకటేశ్వరరావు, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భవానీ 2019లో చల్లపల్లి పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.